
టైటిల్ : అక్రమ రవాణ నియంత్రణకు రైళ్ళలో ఆకస్మిక తనిఖీలు
*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,*
జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణ నియంత్రణకు
మరియు అనుమానస్పద వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయాణికులతో రద్దీగా వెళ్లే మూడు ట్రైన్స్ ను లక్ష్యంగా చేసుకొని మే 15న ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 16న తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ – జిల్లాలో మద్యం, గంజాయి,
మందుగుండు, ప్రేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణ నియంత్రణకు, అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి
తీసుకొనే లక్ష్యంతో చీపురుపల్లి, బొబ్బిలి, ఎస్.కోట రైల్వే స్టేషన్లులో పోలీసు అధికారులు, సిబ్బంది, బాంబ్ డిస్పోజల్,
డాగ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు చేపట్టామన్నారు. బొబ్బిలి రైల్వే స్టేషనులో కోరావుట్ నుండి విశాఖపట్నం వెళ్ళే డి.ఎం.యు., చీపురుపల్లి రైల్వే స్టేషనులో గుణుపూరు నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్, ఎస్.కోట రైల్వే స్టేషనులో
కిరండల్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లను లక్ష్యంగా చేసుకొని పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారన్నారు.
తనిఖీల్లో ట్రైన్స్ లో ప్రయాణించే పాసింజర్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది
బృందాలుగా ఏర్పడి, ఒక్కొక్క కంపార్టుమెంటును ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ట్రైన్లను ఆయా పోలీసు స్టేషనులో నిలిపి వేయకుండా, ఆయా ట్రైన్స్ ను పోలీసు అధికారులు, సిబ్బంది కొత్తవలస వెళ్ళేంత వరకు ప్రయాణించి, ప్రయాణికుల బ్యాగులు, లగేజ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసారన్నారు. ఈ తనిఖీల్లో ఎస్టీఎఫ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ కూడా పాల్గొన్నాయి. ఈ తనిఖీలు చేపట్టే
ముందు ట్రైన్స్ లో చేపట్టాల్సిన విధుల గురించి విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఎస్.కోట రైల్వే స్టేషను వద్ద, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి బొబ్బిలి రైల్వే స్టేషను వద్ద, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు చీపురుపల్లి రైల్వే స్టేషను వద్ద రైడ్స్ లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది, ఎస్టీఎఫ్, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలకు దిశా నిర్దేశం చేసారు. ఈ
అకస్మిక తనిఖీల్లో 20.5 కిలోల గంజాయి, నలుగురు నిందితులు పట్టుబడగా, తదుపరి చర్యల నిమిత్తం జి.అర్.పి.పోలీసులకు అప్పగించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తరహా తనిఖీలను భవిష్యత్తులో కూడా కొనసాగించి, నేర
నియంత్రణకు ఆకస్మిక తనిఖీలు చేపడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
ఈ తనిఖీలను విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురువల్లి డిఎస్పీ
ఎస్.రాఘవులు పర్యవేక్షించగా, తనిఖీల్లో బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్, చీపురుపల్లి సిఐ శంకర్రావు, రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్.కోట సిఐ వి.నారాయణ మూర్తి, ఎస్. కోట రూరల్ సిఐ ఎల్. అప్పలనాయుడు, కొత్తవలస సిఐ సిహెచ్.షణ్ముఖరావు, ఎల్.భాస్కరరావు, శోభన్ బాబు, మూడు సబ్ డివిజన్లకు చెందిన 30మంది ఎస్ఐలు, 150మంది పోలీసు సిబ్బంది, డాగ్
స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీమ్స్ పాల్గొన్నాయి.